ఒమెగా ఆధ్వర్యంలో ఈఎన్టీ కాంక్లేవ్–2025

ఒమెగా ఆధ్వర్యంలో ఈఎన్టీ కాంక్లేవ్–2025

హైదరాబాద్, వెలుగు: ఒమెగా హాస్పిటల్స్, ఇండియా ఓటోలారింజాలజిస్ట్స్ అసోసియేషన్ హైదరాబాద్(ఏఓఐ), తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ) సంయుక్తాధ్వర్యంలో “హియరింగ్ టుడే లీడింగ్ టుమారో ” అనే అంశంపై ఈఎన్టీ కాంక్లేవ్–2025ను నిర్వహించారు. రెండు రోజులపాటు సాగిన ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ ప్రముఖులతోపాటు పీజీ స్టూడెంట్లు, వైద్య నిపుణులు సహా 175 మందికిపైగా హాజరయ్యారు.

డాక్టర్ వెన్నెల దేవరకొండ, డాక్టర్ మోహన వంశీ నిర్వహించిన ఈ కాంక్లేవ్ కు దేశవ్యాప్తంగా ఈఎన్టీ నిపుణుల నుంచి ప్రశంసలు అందాయి. ఒమెగా హాస్పిటల్స్, ఇండో-అమెరికన్ ఫ్యాకల్టీ సంయుక్తంగా తల, మెడ క్యాన్సర్లలో ఇమ్యూనోథెరపీపై తాజా పరిశోధనలను సమర్పించారు. నిపుణులు తమ నూతన సర్జికల్ టెక్నిక్ లను ప్రదర్శించారు.