గాంధీ జయంతి.. మహాత్మాకు మోదీ నివాళులు

గాంధీ జయంతి.. మహాత్మాకు మోదీ నివాళులు

మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. బాపు కాలాతీత బోధనలు ప్రతి ఒక్కరి మార్గాన్ని ప్రకాశవంతం చేస్తూనే ఉన్నాయని ప్రధాని ఈ సందర్భంగా ట్వీట్‌ ద్వారా తెలిపారు.

“గాంధీ జయంతి అనే ప్రత్యేక సందర్భంగా నేను మహాత్మా గాంధీకి నమస్కరిస్తున్నాను. ఆయన నిత్య బోధనలు మన మార్గాన్ని ప్రకాశింపజేస్తూనే ఉన్నాయి. మహాత్మా గాంధీ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఐక్యత, కరుణ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మొత్తం మానవాళిని ప్రేరేపిస్తుంది. ఆయన కలలను నెరవేర్చేందుకు మనం ఎల్లప్పుడూ కృషి చేద్దాం. మహాత్మా ఆలోచనలు ప్రతి యువకుడికి తాను కలలుగన్న మార్పుకు కారకునిగా మారాలని, అందరిలో ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించాలి అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 7.30 గంటలకు రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ ఎల్‌జీ వీకే సక్సేనా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.