న్యూఢిల్లీ: దేశ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 75వ పడిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు హ్యాపీ బర్త్డే విషెస్ చెబుతూ ప్రముఖులు ట్వీట్లు చేశారు. బలహీనంగా ఉన్న వారికి సేవ చేయడంలో కోవింద్ ముందుంటారని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. కోవింద్ది సునిశిత అంతర్దృష్టి అని, విధానాలపై ఆయనకు ఉన్న అవగాహన మన దేశానికి గొప్ప ఆస్తి అని పేర్కొన్నారు. కోవింద్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు. మోడీతోపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ప్రహ్లాద్ జోషి రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Birthday wishes to Rashtrapati Ji. His rich insights and wise understanding of policy matters are great assets for our nation. He is extremely compassionate towards serving the vulnerable. I pray for his good health and long life. @rashtrapatibhvn
— Narendra Modi (@narendramodi) October 1, 2020