- అబుదాబికి వెళ్లేందుకు యత్నించిన ప్యాసింజర్ అరెస్ట్
శంషాబాద్, వెలుగు : గోల్డ్ బిస్కెట్లతో దుబాయ్లోని అబుదాబికి వెళ్లేందుకు యత్నించిన ప్యాసింజర్ను శంషాబాద్ ఎయిర్పోర్టు కస్టమ్స్, సీఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. శ్రీరంగప్ప అనే ప్యాసింజర్ అబుదాబికి వెళ్లే ఫ్లైట్ కోసం గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చాడు. అతడి లగేజీని స్కానింగ్ చేసిన సీఐఎస్ఎఫ్ అధికారులు అందులో కిలోన్నర గోల్డ్ బిస్కెట్లను గుర్తించారు.
వాటిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గోల్డ్ బిస్కెట్ల విలువ సుమారు రూ.90 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ప్యాసింజర్ను అదుపులోకి తీసుకుని కేసు ఫైల్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.