బోరుబావిలో పడ్డ చిన్నారుల్లో ఒకరు మృతి 

బోరుబావిలో పడ్డ చిన్నారుల్లో ఒకరు మృతి 

బోరు బావిలో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. ఇద్దరు చిన్నారులు బోరుబావిలో ఒకరు క్షేమంగా బయటపడ్డారు. మరో చిన్నారి మృతి చెందింది. చిన్నారులను గోపిరాజు, మోక్షితగా గుర్తించారు. వీరిద్దరూ అనే అన్నాచెల్లెళ్లు కావడం విశేషం. ఈ ప్రమాదంలో  చిన్నారి మోక్షిత మృతి చెందింది.

సోమవారం విడుమనూరు మండలం ఊటుకూరు పెదపాలెంలో ఈ విషాదం జరిగింది. 10 అడుగుల లోతులో చిన్నారి ఉన్నట్టు గుర్తించారు. జేసీబీతో గంటన్నర పాటు శ్రమించి బోరుబావి పక్కనే సహాయక సిబ్బంది గొయ్యి తవ్వింది. అన్నాచెల్లెళ్లు ఆడుకుంటూ బోరుబావిలో పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. చిన్నారుల్లో ఒకరు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.