సికింద్రాబాద్ లోని రైల్ నిలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై స్కూల్ కు వెళ్తున్నతండ్రీ కొడుకులిద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి గిరి మృతి చెందాడు. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కారు అతివేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.
see more news