జగిత్యాల టౌన్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మీ స్కీమ్ కింద రూ.లక్ష నగదుతో పాటు వధువుకు తులం బంగారం పెడతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, జగిత్యాలలో తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
శనివారం జగిత్యాలలోని ఇందిరా భవన్లో ఎమ్మెల్సీ సమక్షంలో రాయికల్ మండలం చింతలూరు, ఆలూరు గ్రామాలకు చెందిన యువకులు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎమ్మెల్యేలు హడావిడిగా మంజూరు పత్రాలు ఇస్తున్నారని ఆరోపించారు.
గృహలక్ష్మి మంజూరు పత్రాలు ఎమ్మెల్యేలు ఇస్తే వాటికి డబ్బులు.. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. గృహలక్ష్మి లబ్ధిదారుడు బేస్మెంట్ పూర్తి చేస్తేనే తొలి దశ రూ.లక్ష ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.