- ఇంట్లోకి వచ్చి కత్తితో యువతి తండ్రిపై దాడి
- అడ్డొచ్చిన అమ్మాయి సోదరుడిపైనా అటాక్
- అక్కడికక్కడే తండ్రి కన్నుమూత
- చికిత్స పొందుతూ యువతి తమ్ముడు మృతి
మాదన్నపేట, వెలుగు: ‘నా కూతుర్ని నీకు ఇచ్చి పెండ్లి చేయడం మాకెవరికీ ఇష్టం లేదు.. నా బిడ్డకు కూడా నిన్ను చేసుకోవాలని లేదు.. దయచేసి ఇక నుంచి మా వెంట పడకు.. నా కూతుర్ని వేధించడం బంద్ చెయ్’ అని అన్న పాపానికి యువతి తండ్రితో పాటు ఆమె తమ్ముడిని కత్తితో పొడిచి చంపేశాడో యువకుడు. హైదరాబాద్పాతబస్తీలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బాగే జహారాకు చెందిన హజ్మత్ అలీఖాన్ (54) ఆటో డ్రైవర్..ఇతడికి కొడుకు ఉమర్అలీఖాన్ (16), ముగ్గురు కూతుళ్లున్నారు. నలుగురూ చదువుకుంటున్నారు.
వీరి పక్కింట్లో హబీబ్ మహమూద్ (27) కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఇతడు ఎలక్ట్రీషియన్.. అయితే, హజ్మత్అలీఖాన్పెద్ద కూతురు ఇంటర్చదువుతుండగా ఆరు నెలలుగా ఆమెను ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని వెంటపడతున్నాడు. ఆమె చెప్పి చూసినా అతడు మారకపోవడంతో వారం కింద తన తండ్రికి విషయం చెప్పింది. అతడు హబీబ్ను పిలిచి మందలించాడు. అయితే, హబీబ్‘నేను నీ కూతురిని ప్రేమిస్తున్నా..పెండ్లి చేసుకుంటే ఆమెనే చేసుకుంటా..నాకు ఇచ్చి పెండ్లి చెయ్’ అని అడిగాడు. దీనికి హజ్మత్ తన కూతురు ఇంకా చదువుకుంటోందని, ఇప్పుడే పెండ్లి చేసే ఉద్దేశం లేదని, తన వెంట పడొద్దని ఖరాకండిగా చెప్పాడు.
దీంతో హబీబ్హజ్మత్ కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా అతడిని అంతమొందించాలని ప్లాన్వేశాడు. గురువారం రాత్రి కత్తి తీసుకుని సరాసరి హజ్మత్ఇంటికి వెళ్లాడు. హజ్మత్కుటుంబసభ్యులతో కలిసి ఉండగా..కత్తి తీసి పొడవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన కుటుంబసభ్యులు ‘బచావ్..బచావ్..’ అంటూ అరవడం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న హజ్మత్కొడుకు 16 ఏండ్ల ఉమర్తన తండ్రిని కాపాడేందుకు అడ్డు వెళ్లాడు. దీంతో అతడిని కూడా విచక్షణారహితంగా పొడిచి పారిపోయాడు. తీవ్రంగా రక్తం పోవడంతో హజ్మత్అక్కడికక్కడే కన్నుమూశాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఉమర్ను ఉస్మానియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
ఇంట్లో పెద్ద దిక్కయిన తండ్రితో పాటు సోదరుడు కూడా చనిపోవడంతో ముగ్గురు ఆడపిల్లలు, హజ్మత్భార్య మాత్రమే మిగిలారు. అంతిమయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే, ఏసీపీ వెంకట్ రెడ్డి, మాదన్నపేట్సీఐ చంద్రశేఖర్ బందోబస్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. కాగా, ఈ ఘటనలో బాధిత కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్అబ్దుల్లా బలాల అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చూడాలని కోరారు.
