పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో పర్మిషన్ లేకుండా కొనసాగుతున్న ఓ ప్రైవేటు స్కూల్ను శుక్రవారం పెబ్బేరు ఎంఈవో జయరాములు తన సిబ్బందితో కలిసి తనిఖీ చేసి సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పెబ్బేరులో సంస్కార్ ఇంటర్నేషనల్ అనే పేరుతో స్కూల్ రన్ చేస్తూ ఎర్రవల్లి మండలకేంద్రంలోని స్కూళ్ల పేరుతో స్టూడెంట్స్ను ఆన్లైన్ లో నమోదు చేసుకున్నట్లు గుర్తించారు.
వెంటనే ఆ స్టూడెంట్స్ను ఆయా స్కూళ్లకు పంపించాలని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో విద్యాశాఖ నుంచి గుర్తింపు పొందకుండా పాఠశాల తరగతులను నిర్వహిస్తున్నందున వెంటనే స్కూల్ను సీజ్ చేశారు. తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంఈవో తెలిపారు. కార్యక్రమంలో పెబ్బేరు కాంప్లెక్స్ హెచ్ఎం నరసింహ గౌడ్, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ వెంకటేశ్, ఎంఆర్సీ ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.
