లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో హ్యాకర్లు బిజీ బిజీ..పెరిగిన సైబర్ నేరాలు

లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో హ్యాకర్లు బిజీ బిజీ..పెరిగిన సైబర్ నేరాలు

బెంగళూరుకరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో హ్యాకర్లు బిజీ అయ్యారు. చాలా మంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటంతో.. వారి సిస్టమ్‌‌‌‌లను హ్యాక్‌‌‌‌ చేయడంపై ఫోకస్ చేశారు. గత నెల 26న ఒక రాష్ట్రానికి చెందిన ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌ మెంట్‌‌‌‌పై కూడా సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్‌‌‌‌కు పాల్పడ్డారని బెంగళూరుకు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్లౌడ్‌‌‌‌సెక్‌‌‌‌ తెలిపింది. ఈ హ్యాకర్‌‌‌‌‌‌‌‌ గుజరాత్‌‌‌‌కు చెందిన రిమోట్ డెస్క్‌‌‌‌ టాప్‌‌‌‌ను, నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ను యాక్సస్ చేసినట్టు ఈ కంపెనీ తన బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది. రష్యన్ హ్యాకర్ ఫోరమ్ ద్వారా సుమారు 800 గిగాబైట్స్ డేటాను అమ్మడానికి ఉంచినట్టు కూడా తెలిపింది.  ఈ డేటాలో పాన్ కార్డుల వివరాలు, జీఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, ఈ–మెయిల్ అడ్రస్‌‌‌‌లు ఉన్నట్టు బ్లాగ్ పోస్ట్ పేర్కొంది. అయితే ఆ హ్యాకర్ గురించి పెద్దగా సమాచారం ఏమీ తెలియదని, అతని నిక్‌‌‌‌నేమ్ ‘బాస్టర్‌‌‌‌‌‌‌‌లార్డ్’ అని పేర్కొంది. పెద్ద పెద్ద సంస్థలకు చెందిన రిమోట్ డెస్క్‌‌‌‌ టాప్ ఆక్సెస్‌‌‌‌ను అమ్మిన చరిత్ర అతనికి ఉందని వివరించింది. ఈ విషయంపై గుజరాత్ ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌ మెంట్‌‌‌‌ను సంప్రదించగా.. ఉన్నతాధికారులుఈ రిపోర్ట్ పూర్తిగా నిరాధారమని కొట్టేశారు. అయితే తమ ఎనాలసిస్‌‌‌‌లో ఆ డేటా అంతా రియల్‌‌‌‌దేనని తేలినట్టు క్లౌడ్‌‌‌‌సెక్ చెబుతోంది. ‘ట్రూకాలర్ ద్వారా ఫోన్ నెంబర్లను వెరిఫై చేశాం. వీరిలో చాలా మంది గుజరాత్‌‌‌‌కు చెందిన వారు. ఫోరమ్ పోస్ట్ తర్వాత రెండు రోజుల్లో, సర్వర్ ఆక్సెస్‌‌‌‌ను హ్యాకర్ కోల్పోయాడు’ అని క్లౌడ్‌‌‌‌సెక్ తన బ్లాగ్ పోస్ట్‌‌‌‌ లో పేర్కొంది.  సాధారణ యూజర్ పేరు, పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌ ను వాడుకుని కంప్యూటర్ లేదా నెట్‌‌‌‌వర్క్ ను హ్యాకర్ తన ఆధీనంలోకి తీసుకుంటాడని క్లౌడ్‌‌‌‌సెక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రాహుల్ శశి తెలిపారు.

హ్యాకింగ్‌‌‌‌లపై తాజా రిపోర్ట్

2020 ప్రారంభం నుంచి హ్యాకింగ్‌‌‌‌లు 15 శాతం పెరిగాయి. 2020 మార్చిలో 20 శాతం ఎగిశాయి.  కరోనా సంబంధిత స్కామ్‌‌‌‌లు మాత్రమే కాక.. డబ్ల్యూహెచ్‌‌‌‌ఓ వెబ్‌‌‌‌సైట్, ఇతర హెల్త్‌‌‌‌ ఆర్గనైజేషన్స్, టెస్ట్ సెంటర్లు, హాస్పిటల్స్ వెబ్‌‌‌‌సైట్లపై సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత గ్లోబల్‌‌‌‌గా హ్యాకింగ్‌‌‌‌లు బాగా పెరిగాయని మరికొన్ని రిపోర్ట్‌‌‌‌ లు కూడా హెచ్చరిస్తున్నాయి. గ్లోబల్ టెక్నాలజీ వెబ్‌‌‌‌సైట్ సీనెట్‌‌‌‌ విడుదల చేసిన తాజా రిపోర్ట్‌‌‌‌ లో కూడా ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి హ్యాకింగ్‌‌‌‌లు 15 శాతం పెరగగా.. ఒక్క మార్చిలోనే 20 శాతం ఎగిసినట్టు పేర్కొంది. చాలా మంది ప్రజలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని, వారికి వారి నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ లపై అంత కంట్రోల్ ఉండకపోవడంతో.. చాలా డేటా లీక్‌‌‌‌ అవుతుందని శశి వివరించారు.