
తెలంగాణ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ మంచి ఫలితాలను ఇస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న బాలకార్మికులను రక్షించిన పోలీసులు వారి కుటుంబాలకు అప్పగించారు. ముస్కాన్ ఆపరేషన్ గురించిన వివరాలు శుక్రవారం (ఆగస్టు 01) ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారుసిన్హా తెలిపారు.
ఈ ఆపరేషన్ లో మొత్తం 7 వేల 6 వందల78 మంది చిన్నారులను రక్షించినట్లు తెలిపారు డీజీ. అందులో 7,149 మంది బాలురు, 529 మంది బాలికల ఉన్నట్లు చెప్పారు. రక్షించిన వారిలో ఎక్కువగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు రాష్ట్రాల నుంచే 3,783 చిన్నారులు ఉన్నారు. నలుగురు చిన్నారులు నేపాల్కు చెందిన వారిగా గుర్తించారు.
►ALSO READ | అవినీతిపై ఏసీబీ కొరడా.. 7 నెలల్లో 148 కేసుల నమోదు.. ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే..
ఇందులో 6,718 మంది బాలకార్మిలుగా పనిచేస్తున్నారని తెలిపారు. స్ట్రీట్ చిల్డ్రన్స్ 357, భిక్షాటన చేస్తున్న వారు 42 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇతర పనులలో 559 మంది ఉన్నట్లు చెప్పారు.
పిల్లలను బాల కార్మికులుగా మార్చుతున్న వారిపై ఇప్పటి వరకు 1,713 కేసులు నమోదు చేశమాని, 1,718 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కాపాడిన పిల్లలలో మొత్తం 6,593 మంది పిల్లలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు చెప్పారు. అదే విధంగా 1,049 మంది చిన్నారులను రెస్క్యూ హోంకు తరలించినట్లు తెలిపారు డీజీ చారుసిన్హా.