పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ప్రతిపక్షాల ర్యాలీ

పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ప్రతిపక్షాల ర్యాలీ

పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్ష ఎంపీల వరుస నిరసనలతో సమావేశాలు వరుస వాయిదాలు పడుతున్నాయి. ముఖ్యంగా రాజ్యసభలో అయితే పరిస్థితి మరోలా ఉంది. 12 మంది విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసనగా..  రాహుల్ గాంధీ అధ్యక్షతన పార్లమెంటులోని ప్రతిపక్ష పార్టీ  నాయకులు మార్చ్ నిర్వహించారు.

రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడం , రైతుల  కనీస మద్దతు ధర, పార్లమెంటులో చర్చ లేకుండా బిల్లులు ఆమోదించే విధానాలపై నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు మార్చ్ నిర్వహించారు. పార్లమెంటులోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు సాగిన మార్చ్ లో నేతలంతా పాల్గొన్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష ఎంపీలంతా రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేను కలిసి చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు  శీతాకాల సమావేశాల ఆఖరి రోజు డిసెంబర్ 23 వరకు మహాత్మగాంధీ విగ్రహం ముందు నిరసన దీక్ష కూడా చేపట్టనున్నారు.