కాళ్లు చేతులు కట్టేసి.. మెడకు తాడు బిగించి.. యువతి దారుణ హత్య

కాళ్లు చేతులు కట్టేసి.. మెడకు తాడు బిగించి.. యువతి దారుణ హత్య

మేడ్చల్ జిల్లా పరిధిలోని డబీల్పూర్ గ్రామంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒరిసా రాష్ట్రానికి చెందిన దాత్రి సింగ్(22) స్థానికంగా కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆదివారం ఉదయం యువతి ఎంతసేపటికి ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు తెరచి చూశారు.

అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను చూసి మరణించినట్టుగా గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో క్లూస్ టీంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాళ్లు, చేతులు కట్టేసి మెడకు తాడు బిగించి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.