పశ్చిమబెంగాల్ లో బరాక్ పూర్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ పై దాడి జరిగింది. కంకినారా నుండి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులెవరో ఆయన కారుపై ఇటుకలతో దాడి చేశారు. తర్వాత కారు దగ్గర్లో ఓ బాంబు విసిరేసారు. ఈ ప్రమాదం నుండి ఆయన క్షేమంగా బయటపడ్డారు. దీనిపై స్పందించిన అర్జున్ సింగ్ తనపై తృణమూల్ కాంగ్రెస్ నేతలే దాడి చేశారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో శాంతి భద్రతలు లేవనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అర్జున్ సింగ్ .దీనిపై విచారిస్తున్నారు పోలీసులు.
BJP MP from Barrackpore Arjun Singh: Our car was attacked with bricks and then a bomb was hurled near it, while I was returning from Kankinara. There is no law and order in West Bengal. President's rule should be imposed in the state. pic.twitter.com/Vf2AGpL1X8
— ANI (@ANI) December 15, 2019