స్టార్ కపుల్ ప్రియాంక చోప్రా-నికో జోనస్ ఎట్టకేలకు తమ కూతురి ఫొటోను ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే తమ గారాల పట్టి ముఖం మాత్రం కనిపించకుండా కవర్ చేసేశారు. భర్త నిక్ జోనస్తోపాటు తన కూతురు మాల్టీ మేరీ చోప్రా జోనస్ ను పట్టుకుని తన గుండెకి హత్తుకుని మాతృత్వపు అనుభూతులు పొందుతూ దిగిన ఫొటోని ప్రియాంక ఇన్స్టాగ్రామ్లో రివీల్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇందులో ప్రియాంక ఎమోషనల్ కామెంట్స్ చేశారు. వంద రోజులకుపైగా ఎన్ఐసీయు(నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో గడిపిన తర్వాత ఎట్టకేలకు మా చిన్ని అమ్మాయి ఇంటికొచ్చింది అంటూ ప్రియాంక ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రతి కుటుంబం ప్రయాణం ప్రత్యేకమైనది, దానికి ఒక నిర్ధిష్టమైన విశ్వాసం అసవరం. మాది కొన్ని నెలలు సవాలుగా సాగినప్పటికీ, పునరాలోచనలో స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఎంతో విలువైనది. ప్రతి క్షణం పరిపూర్ణంగా ఉంటుంది అని పేర్కొంది. కూతురు తమ జీవితంలోకి వచ్చాక కలిగే ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేమని ప్రియాంక పేర్కొంది.
ఈ ఏడాది జనవరిలో ప్రియాంక చోప్రా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అప్పటినుంచి కూతురికి సంబంధించి ఏ అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ప్రియాంక దంపతులు ఎందుకింత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారని చాలామంది భావించారు. కానీ అసలు కారణమేంటంటే... ఇన్నాళ్లు ఆ చిన్నారి ఎన్ఐసీయూ(నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో చికిత్స అందించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించారు.
రాడి చిల్డ్రన్స్ లా జోల్లా, లాస్ ఏంజిల్స్ లోని సెడార్ నినాయ్ ఆసుపత్రుల్లో తమ పాప కోసం నిస్వార్థంగా పనిచేసిన ప్రతి ఒక్క డాక్టర్, నర్సు, స్పెషలిస్ట్ లకు ప్రియాంక ధన్యవాదాలు తెలిపారు. ఫైనల్గా ఆసుపత్రి నుంచి ఇంటికి రావడంతో కూతురిని మదర్స్ డే సందర్భంగా ప్రపంచానికి పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రియాంక, నిక్ ప్రేమించుకుని 2018 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇట్స్ ఆల్ కమ్మింగ్ బ్యాక్ టూ మీ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తుంది.
మరిన్ని వార్తల కోసం
ఉపాధి పనులకు బొట్టుపెట్టి పిలుస్తున్నరు
భారీ నష్టాల్లో దేశీ సూచీలు