టీ20 ప్రపంచకప్ కు పాకిస్తాన్ జట్టు ఇదే

టీ20 ప్రపంచకప్ కు పాకిస్తాన్ జట్టు ఇదే
  • ప్రపంచకప్ కు ముందు న్యూజిలాండ్, ఇంగ్లండ్ లతో సిరీస్ ఆడనున్న పాక్ జట్టు

ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్ కు పాకిస్తాన్ జట్టును ప్రకటించింది. 15మంది సభ్యుల పాక్ జట్టుకు బాబర్ ఆజమ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ప్రపంచకప్ టోర్నీకి ముందే రిహార్సల్ గా పాక్ జట్టు ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో టీ20 సిరీస్ ఆడేలా షెడ్యూల్ చేసుకుంది.  న్యూజిలాండ్ తో 5 మ్యాచుల సిరీస్ ఈనెల 25న ప్రారంభం కానుంది. అలాగే ఇంగ్లండ్ తో 2 టీ20 మ్యాచుల సిరీస్ వచ్చే నెల 13, 14వ తేదీల్లో ఢీకొనబోతోంది. అయితే చిరకాల ప్రత్యర్థులైన భారత పాక్ జట్ల మధ్య జరగనున్న హై ఓల్టేజీ మ్యాచ్ అక్టోబర్ 24న దుబాయ్ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. జట్టు కు షోయబ్ మాలిక్, సర్ ఫ్రాజ్ అహమ్మద్ లను ఎంపిక చేయకపోవడంపై పాక్ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పీసీబీని దుమ్మెత్తిపోస్తూ ట్రోల్ చేస్తున్నారు. 
పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, ఆసిఫ్ అలీ, ఖుష్దిల్ షా, మహమ్మద్ హఫీజ్, షోయబ్ మసూద్, ఆజమ్ ఖాన్, ఇమాద్ వాసిమ్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వాసిమ్, షాదాబ్ ఖాన్, హసన్ ఆలీ, హరీస్ రవూఫ్, మహమ్మద్ హస్నైన్, షాహిన్ ఆఫ్రిది. వీరితోపాటు ఫకర్ జమాన్, ఉస్మాన్ ఖాదిర్, షానవాజ్ ధానిలను రిజర్వు ఆటగాళ్లుగా ప్రకటించారు.