కొల్లాపూర్(నాగర్ కర్నూల్), వెలుగు: పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ద్వారా ఆగస్టు 15లోగా నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్ట్ సీఈ అబ్దుల్ హమీద్ ఖాన్, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి తెలిపారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ పవర్ ప్యానల్, టన్నెల్, మోటార్లను పరిశీలించారు. ప్రాజెక్ట్ పవర్ కంట్రోల్ ప్యానల్ టెస్టింగ్ నిర్వహించారు.
నార్లాపూర్ వద్ద ఫస్ట్ లిఫ్ట్లో ఒక మోటార్ పంపింగ్ సిస్టం పవర్ ప్యానల్ చార్జింగ్ చేశారు. ఏదుల నుంచి నార్లాపూర్ వరకు 94 టవర్స్తో పవర్ లైన్ నిర్మించామని, నార్లాపూర్ పంప్హౌజ్లో మొదటి మోటార్ ప్రారంభించి నీటిని విడుదల చేస్తామన్నారు. ఆయనతోపాటు ట్రాన్స్కో డైరెక్టర్లు సూర్యప్రకాశ్, జగత్రెడ్డి, ప్రాజెక్ట్ సీఈ శ్రీరాం నాయక్, ఈఈ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
