పార్లమెంటు శీతాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే ముందే ముగిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7న ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 29 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే డిసెంబర్ 23న పార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడనున్నట్లు సమాచారం. అంటే షెడ్యూల్ (డిసెంబరు 29) కంటే ఆరు రోజులు ముందుగానే సమావేశాలు ముగిసే చాన్స్ ఉంది.
లోక్సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. లోక్సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.