- వరల్డ్ యూత్ రికర్వ్ చాంపియన్గా నిలిచి రికార్డు
లిమెరిక్ (ఐర్లాండ్) : ఇండియా యంగ్ ఆర్చర్ పార్థ్ సాలుంకే చరిత్ర సృష్టించాడు. వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్షిప్స్ రికర్వ్ మెన్స్ కేటగిరీలో గోల్డ్ నెగ్గిన తొలి ఇండియన్గా రికార్డుకెక్కాడు. మహారాష్ట్రకు చెందిన 19 ఏండ్ల సాలుంకే ఆదివారం రాత్రి జరిగిన అండర్21 మెన్స్ రికర్వ్ ఇండివిడ్యువల్ ఫైనల్లో 7–3 తో ఏడో సీడ్ సంగ్ ఇంజున్ (కొరియా)పై అద్భుత విజయం సాధించాడు. అంతకుముందు ర్యాంకింగ్ రౌండ్లో టాప్ ప్లేస్లో నిలిచాడు. అండర్21 విమెన్స్ రికర్వ్లో ఇండియాకు చెందిన భజా కౌర్ 7–1తో సు సిన్ యు (చైనీస్ తైపీ)ని ఓడించి బ్రాంజ్ నెగ్గింది. మొత్తంగా ఈ టోర్నీలో ఇండియా అత్యధికంగా 11 మెడల్స్ సొంతం చేసుకుంది. ఇందులో ఆరు గోల్డ్, ఒక సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.