
- ఫ్లైట్లో అమెరికన్ మృతి
- వెనక్కి తిరిగొచ్చిన విమానం
న్యూఢిల్లీ: అమెరికాకు బయలుదేరిన విమానంలోని ఓ ప్యాసింజర్ మృతి చెందడంతో మూడు గంటలపాటు ప్రయాణించిన ఆ ఫ్లైట్ వెనక్కి వచ్చింది. ఈ ఘటన ఢిల్లీ ఇంటర్నేషనల్ఎయిర్పోర్టులో జరిగింది. శనివారం ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-105 విమానం ఢిల్లీ నుంచి నెవార్క్కు టేకాఫ్ అయింది. భార్యతోపాటు వెళ్తున్న ఓ అమెరికన్ సిటిజన్ విమానం ఆకాశంలో ఉండగానే చనిపోయాడు. దీంతో మూడు గంటల జర్నీ తర్వాత ఆ ఫ్లైట్ను వెంటనే వెనక్కి మళ్లించి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ‘ఎయిర్ ఇండియా ఢిల్లీ–-నెవార్క్ (యూఎస్) విమానం మూడు గంటలకుపైగా ప్రయాణించిన తర్వాత అత్యవసర వైద్య పరిస్థితి కారణంగా ఢిల్లీకి తిరిగి వచ్చింది’ అని ఎయిర్ ఇండియా ఆఫీసర్ఒకరు తెలిపారు. ఎయిర్పోర్ట్లో డాక్టర్లు విమానంలోకి వచ్చి ఆ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించారని చెప్పారు.