ఢిల్లీ టు అమెరికా ఫ్లైట్​లో ప్యాసింజర్​ మృతి

ఢిల్లీ టు అమెరికా ఫ్లైట్​లో ప్యాసింజర్​ మృతి
  • ఫ్లైట్​లో అమెరికన్​ మృతి
  • వెనక్కి తిరిగొచ్చిన విమానం

న్యూఢిల్లీ: అమెరికాకు బయలుదేరిన విమానంలోని ఓ ప్యాసింజర్ ​మృతి చెందడంతో మూడు గంటలపాటు ప్రయాణించిన ఆ ఫ్లైట్ వెనక్కి వచ్చింది. ఈ ఘటన ఢిల్లీ ఇంటర్నేషనల్​ఎయిర్​పోర్టులో జరిగింది. శనివారం ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియాకు చెందిన ఏఐ-105 విమానం ఢిల్లీ నుంచి నెవార్క్‌‌‌‌‌‌‌‌కు టేకాఫ్‌‌‌‌‌‌‌‌ అయింది. భార్యతోపాటు వెళ్తున్న ఓ అమెరికన్​ సిటిజన్​ విమానం ఆకాశంలో ఉండగానే చనిపోయాడు. దీంతో మూడు గంటల జర్నీ తర్వాత ఆ ఫ్లైట్​ను వెంటనే వెనక్కి మళ్లించి ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లో ల్యాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ‘ఎయిర్ ఇండియా ఢిల్లీ–-నెవార్క్ (యూఎస్) విమానం మూడు గంటలకుపైగా ప్రయాణించిన తర్వాత అత్యవసర వైద్య పరిస్థితి కారణంగా ఢిల్లీకి తిరిగి వచ్చింది’ అని ఎయిర్ ఇండియా ఆఫీసర్​ఒకరు తెలిపారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లో డాక్టర్లు విమానంలోకి వచ్చి ఆ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించారని చెప్పారు.