చంద్రబాబు నివాసానికి పవన్.. సీట్ల సర్దుబాటుపై చర్చ

చంద్రబాబు నివాసానికి పవన్.. సీట్ల సర్దుబాటుపై చర్చ

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనూహ్య  మార్పులు చేటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షపార్టీలు వ్యూహ రచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (ఫిబ్రవరి4)  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలోని టీడీపి అధినేత చంద్రబాబు నివాసంలో భేటీ కానున్నారు. 

ఇరు పార్టీల సీట్ల కేటాయింపుపై చర్చించనున్నారు. జనసేనకు 25 సీట్లు ఇవ్వడానికి టీడీపీ అంగీకరిస్తుంటే అంతకంటే ఎక్కవ స్ధానాలు కావాలని జనసేన నాయకులు పట్టుబడుతున్నారు.  సీట్ల సర్ధుబాటు వ్యవహారం ఈ భేటీతో కొలిక్కిరానున్నట్లు సమాచారం. 

ఒకటి రెండు రోజుల్లో జనసేన పోటీ చేయనున్న స్థానాలపై స్పష్టత రానుంది. ఉమ్మడిగా నిర్వహించే టీడీపీ, జనసేనల బహిరంగ సభలు, మ్యానిఫెస్టో వంటి అంశాలపై ఈ రోజు చర్చించనున్నారు.