ఇవాళ విజయనగరం,గుంటూరులో పవన్ ప్రచారం

ఇవాళ విజయనగరం,గుంటూరులో పవన్ ప్రచారం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ(శుక్రవారం) విజయనగరం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఓవైపు ఏపీ, మరోవైపు తెలంగాణలోనూ ప్రచారం నిర్వహిస్తున్న పవన్… ఇవాళ ఉదయం 10 గంటలకు విజయనగరంలో, 11 గంటలకు నెల్లిమర్లలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో, సాయంత్రం 4 గంటలకు తెనాలిలో, 5 గంటలకు గుంటూరు మున్సిపల్‌ ఆఫీస్‌ సెంటర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు పవన్ కల్యాణ్.