బీజేపీ టికెట్​ఎవరికి ఇచ్చినా గెలిపించాలి: పీసీ మోహన్

బీజేపీ టికెట్​ఎవరికి ఇచ్చినా గెలిపించాలి:  పీసీ మోహన్

జనగామ అర్బన్, వెలుగు :  బీజేపీ టికెట్ ఎవరికి ఇచ్చినా కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి గెలిపించాలని బెంగళూర్ ఎంపీ పీసీ మోహన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జూబ్లీ గార్డెన్ లో బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీజేపీ బూత్​ అధ్యక్షులు ఆపైస్థాయి కార్యకర్తల సమావేశానికి జనగామ ఇన్​చార్జి యాప సీతయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి విజయ రామారావుతో కలిసి ఆయన దిశానిర్దేశం చేశారు. 

బీఆర్ఎస్​ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వకుండా గుణపాఠం చెప్పాలన్నారు.  కార్యక్రమంలో ఉడుగుల రమేశ్​, మాదాసి వెంకన్న, సౌడ రమేశ్, శివరాజ్ యాదవ్, కొంతం శ్రీనివాస్, మాచర్ల భిక్షపతి, బెజాడి బీరప్ప, పవన్​ శర్మ, బల్ల శ్రీనివాస్, హరిశ్చంద్ర గుప్త, సంపత్ కుమార్, అశోక్​ పాల్గొన్నారు.