హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ మార్గదర్శకాలకు తగ్గట్టుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆగస్టు 15 నాటికి మండల, టౌన్, డివిజన్ కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వానికి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కమిటీల ఎంపికకు సంబంధించి అనుసరించాల్సిన మార్గదర్శకాలు, స్పష్టమైన కాలపరిమితితో కూడిన సర్క్యులర్ను జారీ చేశారు. నిర్దేశిత గడువులోగా నియామకాలు పూర్తి చేసే బాధ్యత జిల్లా నాయకత్వాని దేనని స్పష్టం చేశారు.
