పీసీసీ వార్ రూమ్ కో ఆర్డినేటర్‌‌గా రాహుల్ రెడ్డి

పీసీసీ వార్ రూమ్  కో ఆర్డినేటర్‌‌గా రాహుల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: పీసీసీ వార్ రూమ్ కో ఆర్డినేటర్‌‌గా కొత్త రాహుల్ రెడ్డి నియమితులయ్యారు. లోక్‌‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం పలు రాష్ట్రాలకు ఏఐసీసీ వార్ రూమ్ కో ఆర్డినేటర్లను ప్రకటించింది. అందులో తెలంగాణకు రాహుల్ రెడ్డిని, ఏపీకి శ్యామ్ చరణ్ ను నియమించింది. జాతీయ స్థాయిలో వార్ రూమ్  కో ఆర్డినేటర్‌‌ హెడ్‌‌గా సుమేధ్ గైక్వాడ్ వ్యవహరిస్తారు. 2024 ఎన్నికలు ముగిసే వరకు వీరు ఈ బాధ్యతల్లో ఉంటారని కాంగ్రెస్ ప్రొఫెషనల్ వింగ్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి తెలిపారు.