ప్రారంభమైన పెద్దగట్టు లింగమంతుల జాతర

ప్రారంభమైన పెద్దగట్టు లింగమంతుల జాతర

సూర్యాపేట జిల్లాలో పెద్దగట్టు లింగమంతుల జాతర సందడి నెలకొంది. స్వామి వారి మకరతోరణాన్ని పెద్దగట్టుకు యాదవ సాంప్రదాయం ప్రకారం తరలించారు. రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మకర తోరణానికి ప్రత్యేక పూజలు చేశారు.

పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు మకరతోరణాన్ని దర్శించుకున్నారు. కేసారం గ్రామంలో ఉన్న దేవర పెట్టెను పెద్దగట్టుకు పంపించడంతో జాతర మొదలు కానుంది. భక్తులు భారీగా హాజరై స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు ఎంపీ లింగయ్య యాదవ్.

పెద్దగట్టు జాతర సందర్భంగా హైదరాబాద్-విజయవాడ హైవేపై దురాజ్‌పల్లి వద్ద వాహనాలను దారి మళ్లిస్తున్నారు.