
- విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికుల ఆరోపణ
జీడిమెట్ల, వెలుగు: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కరెంట్ షాక్ తగలి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పేట్బషీరాబాద్ పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. సుభాష్నగర్ లాస్ట్బస్టాప్ ప్రాంతానికి చెందిన అబ్దుల్రెహమాన్ (8) మంగళవారం సాయంత్రం ఇంటి వద్ద క్రికెట్ఆడుకుంటున్నాడు. అదే రోడ్డులో కంచె లేని ట్రాన్స్ఫార్మర్ఉంది. క్రికెట్ బాల్ ట్రాన్స్ఫార్మర్ వద్ద పడింది.
దీంతో అబ్దుల్రెహమాన్ వెళ్లి బాల్ తీస్తుండగా.. ట్రాన్స్ఫార్మక్కు ఏర్పాటు చేసిన తీగలు తగిలి కరెంట్షాక్కు గురవగా.. తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే బాలుడికి కరెంట్ షాక్ తగిలిందని ప్రజలు ఆరోపించారు.