వికారాబాద్, వెలుగు: దేశ ప్రజలు కాంగ్రెస్ వాగ్దానాలను నమ్మడం లేదని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి.. రెండు పైసలు కూడా చేయలేదని విమర్శించారు. ప్రజా ఆశీర్వాద యాత్రకు నిరుపేదలు, వృద్ధులు ఎదురు వచ్చి పింఛన్ పెంచలేదని వాపోతున్నట్లు చెప్పారు. కరెంటు, నీళ్ల సమస్య రోజురోజుకూ పెరిగిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ధారూర్ మండల కేంద్రంతో పాటు మన్ననూరు, సోమారం, పీలారం, రాళ్లచిత్తంపల్లి, గడ్డమీది గంగారం, నాగారం, మామిడి కలాన్ గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్రకు ప్రజల నుంచి స్పందన వచ్చింది.
కాంగ్రెస్ వాగ్దానాలను ప్రజలు నమ్మట్లేదు : కొండా విశ్వేశ్వర్ రెడ్ది
- హైదరాబాద్
- April 8, 2024
లేటెస్ట్
- నేడు కొత్తగూడెంకు సీఎం
- వనపర్తిలో హోమ్ ఓటింగ్ షురూ
- హైదరాబాద్లో హోమ్ ఓటింగ్ షురూ
- రాహుల్ సభను సక్సెస్ చేయాలి : జూపల్లి కృష్ణారావు
- జిల్లాలు రద్దు చేస్తే ఊరుకోం : నిరంజన్రెడ్డి
- హైదరాబాద్ లో వరదలొస్తే మోదీ రూపాయి ఇయ్యలే : కేటీఆర్
- నిరు పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం : వంశీచంద్రెడ్డి
- వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం : కొట్టాల యాదగిరి
- వంశీ కృష్ణను ఆశీర్వదించండి : గడ్డం వివేక్ సరోజ
- సీఎం రేవంత్ విచక్షణ కోల్పోయి మాట్లాడారు : వేలేటి రాధాకృష్ణ శర్మ
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్