ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోలు డివిజన్ అయ్యప్పనగర్ కాలనీలో దుర్భర పరిస్థితితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో ఇండ్లను వరద ముంచెత్తుతుంటే.. మిగిలిన రోజుల్లో మురుగు చుట్టుముడుతోంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఇక్కడి జనం రోజూ నరకం చూస్తున్నారు.
సొంతిళ్లు ఉన్నవారు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. వెళ్లలేని వారు ఇక్కడే ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల మధ్య పారుతున్న మురుగులో ఈగలు, దోమలు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏడాదంతా ఇదే పరిస్థితి ఉంటున్నా వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు.