ఆరు రోజులు లాక్ డౌన్.. లిక్కర్ షాపులకు క్యూ కట్టిన జనం

ఆరు రోజులు లాక్ డౌన్.. లిక్కర్ షాపులకు క్యూ కట్టిన జనం

ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. లిక్కర్ షాపుల ముందు క్యూ కడుతున్నారు మందుబాబులు. ఢిల్లీలో 26 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించడంతో వెంటనే లిక్కర్ షాపుల ముందు బారులు తీరారు జనం. ఖాన్ మార్కెట్‌లోని ఓ లిక్కర్ షాపు ముందు  మాస్కుల్లేకుండా సోషల్ డిస్టెన్స్ లేకుండా గుమిగూడారు. కోవిడ్ రూల్స్ పాటించకుండా మందుకోసం ఎగబడుతున్నారు. లిక్కర్ షాపు యజమానులు కూడా కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు.