
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో రోడ్డుపై చేతబడి వస్తువులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపై కొబ్బరి కాయలు, కోడి గుడ్లు, పసుపు, కుంకుమ పడేశారు. వాటిని చూసి ప్రజలు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న CI ప్రవీణ్ కుమార్....చేతబడి లాంటివి నమ్మొద్దన్నారు. ప్రజలు భయపడొద్దని ధైర్యం చెప్పారు.