ఇంటర్ ఎగ్జామ్స్‌ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్

ఇంటర్ ఎగ్జామ్స్‌ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్

తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి జరగనున్నాయి.  గతేడాదిలో ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. అప్పటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌ ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్నారు. కరోనా కారణంగా పరీక్షలు రాయకుండానే వారు ప్రమోట్ అయ్యారు. అయితే.. 70 శాతం సిలబస్ తో వారికే ఈ సారి ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. వారికి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఇవాళ(గురువారం) పిటిషన్ దాఖలైంది.

విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. ఇప్పటికే ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకూడదని కోరారు. పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.  మరోవైపు.. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే విద్యార్ధులు హాల్ టికెట్లు వెబ్‌సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.