- వినూత్న నిరసన తెలిపిన కాంగ్రెస్ లీడర్లు
జహీరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని ఓ టీఆర్ఎస్ లీడర్ కి కాంగ్రెస్ నాయకులు పెళ్లి గిఫ్ట్గా 5 లీటర్ల పెట్రోల్ ఇచ్చి వినూత్నంగా పెట్రోల్ధరలపై నిరసన తెలిపారు. మంగళవారం రాత్రి కోహిర్లో అధికార పార్టీ నాయకుడు సయ్యద్ రషీద్ పెళ్లి జరిగింది. ఆ వేడుకకు హాజరైన స్థానిక కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ మోసిన్, అతని ఫ్రెండ్స్ పెండ్లి కొడుకుకు 5 లీటర్ల పెట్రోలును గిఫ్ట్గా ఇచ్చారు. పెట్రోలు డబ్బాను అందంగా గిఫ్ట్ప్యాక్ చేయించి తెచ్చి పెళ్లి కొడుకు చేతిలో పెట్టి ఫొటోలు దిగారు. అనంతరం అందరి ముందు ఓపెన్ చేయించారు. దాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.