ఆమెకు హాట్సాఫ్ చెప్పాల్సిందే: భర్తతో ఫోన్లో మాట్లాడుతూ సర్జరీ

ఆమెకు హాట్సాఫ్ చెప్పాల్సిందే: భర్తతో ఫోన్లో మాట్లాడుతూ సర్జరీ

ఓ మహిళకు అరుదైన సర్జరీ చేశారు జైపూర్ కు చెందిన ఓ ప్రైవేట్ డాక్టర్లు. సర్జరీ సమయంలో పేషంట్ ఓపికకు హాట్సాఫ్ చెప్పాల్సిందే.  శాంతి దేవి అనే మహిళ మాట్లాడేందుకు ఇబ్బందిపడేది. తీవ్రమైన మైకంతో బాధపడేది. దీంతో ఆమెను జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడులో కణితిని గుర్తించారు. ఆమె శరీరంలోని కుడి భాగం, మాటలను కంట్రోల్ చేసే భాగం వద్ద ఈ కణితి ఉండటం వల్ల సరిగా మాట్లాడలేకపోతుందని తెలుసుకున్నారు. సర్జరీతో కణితి తొలగించాల్సి ఉంటుందని వైద్యులు ఆమెకు సూచించారు.

ఈ సర్జరీ చేసేముందు మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ.. పేషంట్ నిద్ర పోకూడదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె సర్జరీకి ఒప్పుకుంది. ఇప్పుడు సర్జరీ సక్సెస్ కావడంతో సంతోషంగా ఉంది. అయితే..3 గంటలు పట్టిన ఈ సర్జరీలో పేషంట్ వ్యవహారించిన తీరు సూపర్భ్. సర్జరీ సమయంలో నిద్ర పోకుండా ఉండటానికి.. ఆమె తన భర్తతో ఫోన్లో మాట్లాడింది. మధ్యలో డాక్టర్లకు సమాధానం చెబుతూ.. అలా సర్జరీ అయ్యే వరకు ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. రోగి మెలకువగా ఉన్నప్పుడే సర్జరీ చేయడమంటే మాటలు కాదు. ఇందుకు ఆ రోగికి ఎంతో ధైర్యం ఉండాలి. డాక్లర్లు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే రోగి ప్రాణాలకే ప్రమాదం.  మహిళ మెదడులో ఉన్న ట్యూమర్‌(కణితి)ను ఆమె మెలకువగా ఉండగానే విజయవంతంగా తొలగించి అబ్బురపరిచారు. ఈ సర్జరీ జరుగుతున్నంత సేపు ఆమె తన భర్తతో మాట్లాడుతూనే ఉండటం గమనార్హం అంటున్నారు.