తెలంగాణ విమోచన ఉద్యమంపై ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్

తెలంగాణ విమోచన ఉద్యమంపై ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్

తెలంగాణ విమోచన ఉద్యమం చారిత్రక ఘట్టాల ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది బీజేపీ. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్,  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఇతర బీజేపీ నేతలు ఎగ్జిబిషన్ ను సందర్శించారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారులకు నివాళులర్పించారు నేతలు.