మణికొండలొ చేనేత కార్మికుల ఫొటో ఎగ్జిబిషన్

మణికొండలొ చేనేత కార్మికుల ఫొటో ఎగ్జిబిషన్

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రముఖ ఫొటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మణికొండలోని సామాన్యశాస్త్రం గ్యాలరీలో నవంబర్ 14 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్యఅతిథిగా హాజరై ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. చేనేత కార్మికుల కష్టం, ప్రత్యేకతను బయటకు తీసుకొచ్చే చిన్న ప్రయత్నమే ఈ ఎగ్జిబిషన్ అని కందుకూరి రమేష్ బాబు అన్నారు. అంతరించి పోతున్న కళారూపాన్ని కొంతమంది  కాపాడుతుండడం గొప్ప విషయమన్నారు. 

ఫొటో ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉందని శేఖర్ కమ్ముల అన్నారు. ఈ గ్యాలరీని వీక్షించిన వారికి సామాన్యుల జీవన విధానంపై అవగాహన వచ్చే అవకాశముందన్నారు. హ్యాండ్లూమ్లను ధరించడం ప్రతీ ఒక్కరికి ఇష్టమని..కానీ దాని వెనుక ఉన్న కష్టం ఈ ఫోటొలను చూస్తే అర్థమవుతుందన్నారు. ప్రతి ఒక్కరు చేనేత దుస్తులను ధరించాలని ఆయన కోరారు.