IAS వెంకట్రామిరెడ్డి రాజీనామా ఆమోదంపై హైకోర్టులో పిల్

IAS వెంకట్రామిరెడ్డి రాజీనామా ఆమోదంపై హైకోర్టులో పిల్

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ రీసెర్చ్ స్కాలర్లు ఆర్. సుబేందర్ సింగ్, జె శంకర్‌లు రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.IAS రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు తెలిపారు. ఐఏఎస్‌లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారన్నారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎలక్షన్‌ కమిషన్, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా తెలిపారు. పిటిషన్‌ను లంచ్ మోషన్‌గా స్వీకరించాలని సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి కోరగా.. ఇవాళ అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది.