పిజ్జా షాపులో చోరీ.. గన్స్ తో వచ్చి లూటీ

పిజ్జా షాపులో చోరీ.. గన్స్ తో వచ్చి లూటీ

పిజ్జా షాపులో దొంగలు హల్ చల్ సృష్టించారు. గన్స్ తో బెదిరించి షాపులో దొంగతనానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో బోర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రాపూర్ నంబర్ టూ కాలనీలో ఉన్న పిజ్జా షాపులో మార్చి 8 సాయంత్రం 7 గంటలకు దొంగలు పడ్డారు. షాపులో కస్టమర్లు, స్టాఫ్ ఉండగానే గన్స్ తో లోపలికి ప్రవేశించి అందర్ని భయబ్రాంతులకు గురిచేశారు. పిజ్జా షాపులోని డబ్బు.. కస్టమర్లను బెదిరించి మరికొంత డబ్బులు వసూల్ చేసి పరారయ్యారు. 

ఈ సన్నివేశమంతా సీసీటీవీలో రికార్డ్ కావడంతో బయటపడింది. ఘటనపై పిజ్జా షాపు యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. దుండగులు షాపులోకి ప్రవేశించి దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేటీజన్స్ ఘటనపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టం కొద్ది షాపులోకి వచ్చిన దుండగులు గన్స్ తో ఎవ్వరికి ఏ హానీ చేయలేదని కామెంట్ చేస్తున్నారు.