ప్రసాదంలో ప్లాస్టిక్ కవర్.. సోషల్ మీడియాలో పోస్టు

ప్రసాదంలో ప్లాస్టిక్ కవర్.. సోషల్ మీడియాలో పోస్టు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వడ ప్రసాదంలో ప్లాస్టిక్ కవర్ రావడం కలకలం రేపింది. యాదగిరిగుట్టకు చెందిన సందీప్ అనే భక్తుడు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 11న యాదాద్రికి వచ్చిన ఆయన స్వామి నిత్య కల్యాణంలో పాల్గొన్నాడు. కల్యాణ టికెట్ పై లడ్డూలతో పాటు ఐదు వడలు కూడా ఇచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం సందీప్​హైదరాబాద్ వెళ్లిపోయాడు. సోమవారం వడ ప్రసాదాన్ని తెరచి చూడగా అందులో ప్లాస్టిక్ కవర్ కనిపించింది. దానిని వీడియో, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు రిపీట్​ కాకుండా‌‌‌‌ సంబంధిత ఆఫీసర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు.