ప్లాట్‌‌ఫాం టికెట్‌‌ ధర రూ.50కి పెంపు

ప్లాట్‌‌ఫాం టికెట్‌‌ ధర రూ.50కి పెంపు
  • సికింద్రాబాద్‌‌ స్టేషన్​లో అమల్లోకి

హైదరాబాద్‌‌, వెలుగు: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని కంట్రోల్‌‌ చేయడానికి రైల్వే స్టేషన్లలో తాత్కాలికంగా ప్లాట్‌‌ఫాం టికెట్‌‌ ధరలను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్​లో ప్లాట్‌‌ఫాం టికెట్ ధర రూ.10 ఉండగా.. రూ. 50కి పెంచినట్లు వెల్లడించింది. మిగతా అన్ని స్టేషన్లలో రూ.10 నుంచి రూ.20కి పెంచుతున్నట్లు పేర్కొంది. పెంచిన ధరలు ఆదివారం నుంచి ఈ నెల 20వ తేదీదాకా అమల్లో ఉంటాయని చెప్పింది.