- సికింద్రాబాద్ స్టేషన్లో అమల్లోకి
హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని కంట్రోల్ చేయడానికి రైల్వే స్టేషన్లలో తాత్కాలికంగా ప్లాట్ఫాం టికెట్ ధరలను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్లో ప్లాట్ఫాం టికెట్ ధర రూ.10 ఉండగా.. రూ. 50కి పెంచినట్లు వెల్లడించింది. మిగతా అన్ని స్టేషన్లలో రూ.10 నుంచి రూ.20కి పెంచుతున్నట్లు పేర్కొంది. పెంచిన ధరలు ఆదివారం నుంచి ఈ నెల 20వ తేదీదాకా అమల్లో ఉంటాయని చెప్పింది.