సీఏఏకు మద్దతు ఇవ్వండి..ప్రధాని మోడీ ట్వీట్

సీఏఏకు మద్దతు ఇవ్వండి..ప్రధాని మోడీ ట్వీట్

న్యూఢిల్లీ: సీఏఏకు మద్దతుగా నిలవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్​లో ప్రచారం ప్రారంభించారు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ఈ చట్టానికి అనుకూలంగా స్వామి సద్గురు జగ్గీ వాసుదేవ్​ మాట్లాడుతున్న వీడియోను ఆయన ట్వీట్​ చేశారు. ‘సీఏఏ కు సంబంధించి చారిత్రక విశేషాలను, సంస్కృతిని, సోదర భావాన్ని వెల్లడించే ఈ మాటలు వినండి’ అని ప్రధాని కోరారు. ‘సీఏఏ అంటే.. మత విద్వేషం కారణంగా సొంత దేశంలో బాధలు పడలేక ఆశ్రయం కోరి వచ్చే వారికి సిటిజన్​షిప్​ ఇవ్వడానికి ఉద్దేశించిందే తప్ప ఎవరి సిటిజన్​షిప్​ను తీసుకోవడానికి కాదు’ అని తన పర్సనల్​ వెబ్​సైట్​లో మోడీ వివరణ ఇచ్చారు. ఇండియా సపోర్ట్స్​ సీఏఏ యాష్​ట్యాగ్​తో ఈ వీడియోను ట్వీట్​ చేశారు. దీనికి మద్దతు తెలుపుతూ నమో యాప్​లో మెసేజ్​చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.