జవాన్లతో దీపావళి వేడుకలు.. లేప్చాకు చేరుకున్న మోదీ

 జవాన్లతో దీపావళి వేడుకలు.. లేప్చాకు చేరుకున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే ఈ సారి కూడా దీపావళి  పండగను జవాన్లతో కలిసి జరుపుకోనున్నారు.  ఇప్పటికే ఆయన హిమాచల్ ప్రదేశ్ లోని లేప్చాకు చేరుకున్నారు.  మిలిటరీ డ్రెస్ ధరించిన ఫొటోలను మోదీ తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి.   2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని మోదీ ప్రతి సంవత్సరం  జవాన్లతోనే దీపావళి పండుగను జరుపుకుంటూ వస్తున్నారు.  

దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు  ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ అందరికీ ఆనందాన్ని, అద్భుతమైన ఆరోగ్యాన్ని అందించాలని ఆకాంక్షించారు. "ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, అద్భుతమైన ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని మోదీ ట్విట్టర్ లో  పోస్ట్‌ చేశారు.