పీఎంవో సిబ్బంది కుమార్తెలతో రాఖీ కట్టించుకున్న మోడీ

పీఎంవో సిబ్బంది కుమార్తెలతో రాఖీ కట్టించుకున్న మోడీ

ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు మహిళలు మోడీకి రాఖీలు కట్టారు. అయితే ఈసారి మోడీ రక్షాబంధన్ వేడుకల్ని చిన్నారులతో కలిసి సరికొత్తగా జరుపుకున్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలో పని చేసే సిబ్బంది పిల్లలతో కలిసి రాఖీ పండుగ చేసుకున్నారు. 

పీఎంఓలో పని చేసే ఫోర్త్ క్లాస్ సిబ్బంది కూమార్తెలతో మోడీ రాఖీ కట్టించుకున్నారు. ఆ చిన్నారుల్లో స్వీపర్లు, ప్యూన్లు, తోటమాలి, డ్రైవర్ల కుమార్తెలు ఉన్నారు. ప్రధాని వారందరికీ స్వీట్లు ఇచ్చి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.