పొంగల్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క భావోద్వేగాన్ని వర్ణిస్తుంది : మోడీ

పొంగల్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క భావోద్వేగాన్ని వర్ణిస్తుంది : మోడీ

దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీ సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు.  దేశ ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర సందర్భంగా, అందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు మరియు సంతృప్తి ప్రవహించాలని కోరుకుంటున్నాట్టు మోడీ తెలిపారు. ఢిల్లీలోని ఎంఓఎస్ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో మోడీ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సొంత బంధువులతో కలిసి పొంగల్‌ను జరుపుకోపుకుంటున్నట్టు భావిస్తున్నానని చెప్పారు. పొంగల్ 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' యొక్క భావోద్వేగాన్ని వర్ణిస్తుందని అన్నారు.  ఈ ఐక్యత యొక్క భావోద్వేగం 'విక్షిత్ భారత్ 2047..." అని మోడీ చెప్పారు.ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా పాల్గొన్నారు.