ప్రధాని నరేంద్ర మోడీ ఓ సాధరణ కార్యకర్తతో తీసుకున్న సెల్ఫీని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఏప్రిల్ 08న హైదరాబాద్ పర్యటనను ముగించుకుని చెన్నైకు బయలుదేరారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ చెన్నై పర్యటనకు వెళ్లారు. అక్కడ బీజేపీ కార్యకర్త తిరు ఎస్. మణికందన్తో సమావేశమై, ఆయనతో ప్రత్యేకంగా సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ ఈ ఫొటొను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. దివ్యాంగుడిగా ఉన్న మణికందన్ బీజేపీ కార్యకర్తంగా ఉండటం గర్వకారణమని అన్నారు.
https://twitter.com/narendramodi/status/1644746362808934400
బూత్ ప్రెసిడెంట్గా సేవలు అందిస్తోన్న మణికందన్ సొంతంగా చిన్న షాపు పెట్టుకుని తనకు వచ్చే లాభంలో కొంత భాగాన్ని పార్టీకి ఇస్తున్నాడని మోడీ అభినందించారు. మణికందన్ జీవిత ప్రయాణం స్ఫూర్తిదాయకమన్న ప్రధాని... పార్టీ భావజలానికి ఆయన కమిట్మెంట్ రెండూ ప్రేరణ ఇస్తున్నాయని తెలిపారు. శనివారం చెన్నైలో రూ. 5,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం డెడ్లైన్లతో పనిచేస్తుందని, చివరి తేదీ కంటే ముందే ఫలితాలను సాధిస్తుందని ప్రధాని అన్నారు.