యువ ఓటర్లతో ఇయ్యాల మోదీ మాటామంతి

 యువ ఓటర్లతో ఇయ్యాల మోదీ మాటామంతి

న్యూఢిల్లీ: నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ప్రధాని మోదీ గురువారం యువ ఓటర్ల తో ముచ్చటించనున్నారు. ఈ మేరకు బీజే వైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వీ సూర్య మీడియాకు వివరాలు వెల్లడించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తం గా 5 వేల ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో యువ ఓటర్లతో ప్రధాని వర్చువల్​గా మాట్లాడతారని చెప్పారు.

2014, 2019 ఎన్నికల్లో  మోదీ ప్రధానిగా ఎన్నికవడంలో యువ ఓటర్లు కీలక పాత్ర పోషించారని తెలిపారు. మోదీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకోవడానికి వారు ఉత్సాహంగా ఉన్నారని వివరించారు. మోదీ ప్రభుత్వంలో యువకులకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.