ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు..

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యింది. మార్చి 4, 5వ తేదీల్లో ప్రధాని మోదీ రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 4వ తేదీన ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు రానున్నారు. అక్కడి నుంచి నేరుగా అదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప చేయనున్నారు. అనంతరం బహింరగ సభలో ప్రసంగించనున్నారు.  

ఇక, మార్చి 5వ తేదీన సంగారెడ్డి జిల్లాలో మోదీ పర్యటిస్తారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్తారు. కాగా.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల గెలుపే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ నాయకులు.. ఇప్పటికే యాత్రల పేరుతో జనాల్లోకి వెళ్లి ప్రాచారం చేస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందే.. బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి దూసుకుపోతోంది.

Also Read : రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు మృతి