ఇంట్లో చోరీ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు

ఇంట్లో చోరీ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దొంగను పట్టుకున్నారు పోలీసులు. రైతు కాలనీలో తాళం వేసిన ఇంట్లో  చోరీ  చేసేందుకు యత్నించాడో దొంగ.  చుట్టుపక్కల ఇళ్లకు గొళ్లెం పెట్టి  ఓ ఇంట్లోకి వెళ్లాడు.  బీరువాను పగలగొట్టి దొంగతనం చేస్తున్న సమయంలో శబ్దాలు రావడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను పట్టుకున్నారు.  దొంగను  హైదరాబాద్ లోని అంబర్ పేట కు చెందిన విజయ్ కుమార్ గా గుర్తించారు పోలీసులు.

కోహ్లీ మరో వరల్డ్ రికార్డ్.. సచిన్ రికార్డ్ బ్రేక్