కస్టమర్ల డబ్బుతో ఆన్​లైన్​ గేమ్స్ ఆడిన ఐసీఐసీఐ బ్యాంక్ ​డీఎం

కస్టమర్ల డబ్బుతో ఆన్​లైన్​ గేమ్స్ ఆడిన  ఐసీఐసీఐ బ్యాంక్ ​డీఎం

నర్సంపేట, వెలుగు, వరంగల్ ​జిల్లాలో కస్టమర్ల డబ్బుతో ఆన్​లైన్ గేమ్స్​ఆడిన ఐసీఐసీఐ బ్యాంక్​డిప్యూటీ మేనేజర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సంపేట సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్​లోని  కరీమాబాద్​కు చెందిన బైరిశెట్టి కార్తీక్ 2019 నుంచి నర్సంపేట ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్​గా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి గోల్డ్​లోన్​రెన్యూవల్, క్లోజింగ్​ట్రాన్సాక్షన్స్​చూసుకుంటున్నాడు.

అయితే నాలుగేళ్లుగా ఐదు పద్ధతుల్లో రూ.8.5కోట్లను తన బినామీ ఖాతాల్లోకి మళ్లించి క్రికెట్​బెట్టింగ్, ఆన్​లైన్ గేమ్స్​ఆడుతూ వచ్చాడు. ఇటీవల బ్యాంకు నిల్వల్లో తేడా రావడంతో అధికారులు కార్తీక్​పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంక్వైరీలో 128 మంది కస్టమర్ల ఖాతాల నుంచి గోల్డ్​లోన్ల డబ్బులను దారి మళ్లించినట్లు తేలింది. ఆడిట్ సమయంలో కస్టోడియన్, ఆడిటర్ల సంతకాలు సైతం ఫోర్జరీ చేసి క్లోజింగ్​చూయించాడని సీఐ తెలిపారు. నర్సంపేట బస్టాండ్​లో కార్తీక్​ను అదుపులోకి తీసుకున్నామని, రిమాండ్​కు తరలిస్తామని వివరించారు.