నాపై దాడిచేసిన పోలీసులను సస్పెండ్​ చేయాలి: ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ

నాపై దాడిచేసిన పోలీసులను సస్పెండ్​ చేయాలి: ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ

ఎల్​బీనగర్, వెలుగు: తనపై దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ ఝాన్సీ డిమాండ్ చేశారు. శ్రీనిధి, గురునానక్ యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం ఉన్నత విద్యామండలిలో వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తే పోలీసులు తమ పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. పోలీసులు అరెస్ట్ ​చేసే క్రమంలో గాయపడిన ఝాన్సీ దిల్​సుఖ్​నగర్​లోని ఓ హాస్పిటల్​లో చికిత్స పొందుతుంది. శుక్రవారం ఆమె హాస్పిటల్​లో మీడియాతో మాట్లాడారు. మహిళలు అని చూడకుండా పోలీసులు తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ కెమెరా లేని రూమ్ లోకి తీసుకెళ్లి మహిళా పోలీసులు తనను చితకబాదారని చెప్పారు. ఆ బాధతోనే పోలీసులపై చేయిచేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఆత్మ రక్షణ కోసం ప్రతిఘటించామే తప్ప వేరే ఉద్దే శం లేదని తెలిపారు. ఝాన్సీని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్​రావు, కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేందర్ రెడ్డి పరామర్శించారు.

పోలీసులపై డీజీపీకి ఫిర్యాదు

బషీర్ బాగ్: ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై దాడి చేసిన హుమాయూన్ నగర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం లక్డీకాపూల్ డీజీపీ ఆఫీస్‌లో బీజేపీ సీనియర్ నాయకుడు రామచందర్ రావుతో కలిసి డీజీపీ అంజనీ కుమార్‌ ను కలిసి ఫిర్యాదు చేశారు.